ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతో.. ఊరచెరువు వద్ద క్లీనింగ్​ షురూ

ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతో.. ఊరచెరువు వద్ద క్లీనింగ్​ షురూ

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రిలోని ఊరుమందమర్రి చెరువు ట్యాంక్​ బండ్​ పరిసరాల్లో మున్సిపల్ సిబ్బంది శనివారం ప్రత్యేకంగా క్లీనింగ్, బుషెస్​ తొలగింపు పనులు చేపట్టారు. ఇటీవల ట్యాంక్​బండ్​ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి సందర్శించగా, వాకర్స్​అసోసియేషన్​ప్రెసిడెంట్, కాంగ్రెస్​ లీడర్ ​బండి సదానందం యాదవ్ ఆధ్వర్యంలో వాకర్స్​ పలు సమస్యలపై విన్నవించారు.

దీంతో ఎమ్మెల్యే ఆదేశాలతో మున్సిపల్​కమిషనర్ తుంగపిండి రాజలింగు నేతృత్వంలో 30 మంది సిబ్బంది, రెండు జేసీబీ, ఒక బ్లేడ్​ట్రాక్టర్​ సహాయంతో శనివారం వాకింగ్​ట్రాక్,​ పరిసరాలను క్లీన్ చేశారు. చెరువు, కట్టపై ఏపుగా పెరిగిన తుమ్మచెట్లు, పొదలను తొలగించారు. సోమవారం నాటికి పనులు పూర్తి చేస్తామని మున్సిపల్​కమిషనర్​ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామికి వాకర్స్​అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది.